జనోదయా,రామగుండం ఫిబ్రవరి 8:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వాతావరణం రోజురోజుకీ మరింత ఉత్సాహంగా మారుతోంది. 55వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్క పద్మ (సుజాత)–శ్రీనివాస్కు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. డివిజన్ అంతటా సాగుతున్న ప్రచారంలో అడుగడుగునా ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
డివిజన్ ప్రజల మాటల్లో చూస్తే, ఈసారి పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్కే ఉందన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.ఎన్నికల రోజున కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలన్న నిర్ణయానికి ఇప్పటికే చాలా మంది వచ్చారని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మొత్తం మీద 55వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూల వాతావరణం ఏర్పడిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.






