ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్పెంచికల్ పేట్‌లో నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం

పెంచికల్ పేట్‌లో నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 16:

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కమాన్‌పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో నిర్వహించిన నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగి విజయవంతంగా ముగిసింది.రాత్రి వేళ వెలుగుల మధ్య సాగిన ఈ పోటీల్లో క్రీడాకారుల అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగగా,గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది.

ఈ టోర్నమెంట్‌కు ప్రధాన ప్రాయోజకుడిగా వ్యవహరించి క్రీడలను ప్రోత్సహించిన అయిలవేని మల్లేష్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.పోటీలను క్రమశిక్షణతో నిర్వహించిన రాజు,రాకేష్,శ్రీధర్,విష్ణు లు అభినందనలు అందుకున్నారు.వారి సమన్వయంతో టోర్నమెంట్ సజావుగా కొనసాగింది.

పోటీల్లో పాల్గొన్న జట్లు సమానంగా ప్రతిభ చాటాయి.చివరికి పిడుగు రాజు జట్టు అద్భుత ఆటతీరుతో విజేతగా నిలిచి ప్రథమ స్థానం దక్కించుకుంది.పెగడపల్లి రాకేష్ జట్టు చివరి వరకు పోరాడి రన్నరప్‌గా నిలిచింది.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మహాశివరాత్రి సందర్భంగా క్రీడా ఉత్సవంగా నిలిచిన ఈ టోర్నమెంట్ గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular