janodaya.in
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 6:07 pm Digital Edition : JANODAYA MEDIA

అత్యవసర వేళ ఆదుకున్న సేవా స్పూర్తి

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 14:

కమాన్‌పూర్ మండల కేంద్రంలో సేవా స్పూర్తి మరోసారి వెలుగుచూసింది.గోదావరిఖనికి చెందిన తుంగపిండి స్వప్న గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు సూచించారు.ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శివసేన సేవా సమితి అధ్యక్షుడు గన్నెవరపు రవిని సంప్రదించగా,కమాన్‌పూర్ గోకుల్‌నగర్‌కు చెందిన తూండ్ల శ్రీనివాస్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు.క్లిష్ట సమయంలో చేసిన ఈ సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉందని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.