janodaya.in
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 8:01 am Digital Edition : JANODAYA MEDIA

నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి:బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందే రామచందర్ 

జనోదయ, మందమర్రి మార్చి 26:

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా వారి అభివృద్ధికి కృషి చేస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్ అన్నారు. మండలంలోని ఆదిల్ పేట గ్రామానికి చెందిన సయ్యద్ ఉస్మాన్ అలీ, కళ్ళు సౌజన్య లకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరమని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ ను అర్హులైన వారుసద్వినియోగం చేసు కోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కొరకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు గోదారి రాజేష్, ఆకుల అంజి, రామటెంకి తిరుపతి లు పాల్గొన్నారు.