జనోదయ,8వ కాలనీ ఆగస్టు 19:
బీజేపీ సీనియర్ నాయకుడు మూకిరి రాజు కుమార్తె మేఘన, సురేష్ల వివాహం 8వ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్లోని సీఎస్ఐ చర్చిలో ఘనంగా జరిగింది. అనంతరం కమ్యూనిటీ హాల్లో విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి, మండల అధ్యక్షుడు ఆకుల శశికుమార్, యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు జెమిని గౌడ్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.