janodaya.in
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 7:00 pm Digital Edition : JANODAYA MEDIA

విద్యా సంస్థల్లో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు

జనోదయ, 8వ కాలనీ ఆగస్టు 25:

బీజేపీ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో కృష్ణవేణి పాఠశాలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు ఐలవేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు విద్యార్థులకు రక్షాబంధన్ ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల శశికుమార్, జిల్లా సీనియర్ నాయకుడు మూకిరి రాజు, ఆకుల కుమార్ గౌడ్, లింగం నాయక్, జంజర్ల శ్రీనివాస్, అఖిల్ గౌడ్, శివ, బన్నీ, విక్కీ, పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.