నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

జనోదయ,కమాన్‌పూర్‌, ఆగస్టు 31:   కీర్తిశేషులు మల్యాల రమేష్‌, సంధ్య దంపతుల కుమార్తె నిశ్చితార్థ వేడుక సోమవారం ఆదివరాహ స్వామి ఆలయ మండపంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నూతన జంటను మాజీ ఎంపీపీలు మల్యాల రాంచంద్రం గౌడ్‌, కోలేటి మారుతి, సర్పంచ్‌ రంగు సత్యనారాయణ గౌడ్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లి శేఖర్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్‌, దేవస్థానం డైరెక్టర్‌ బూస శ్రీనివాస్‌, కొంతం సత్యనారాయణ, మీడియా ప్రతినిధులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు.