జనోదయ తెలంగాణ,ఫిబ్రవరి 4:
ఫిబ్రవరి రెండో వారంలో సెలవులను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సాధారణ ప్రయాణికుల కోసం సరికొత్త పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.3,500తో గోవా, హంపి, తుల్జాపూర్లను సందర్శించే నాలుగు పగళ్లు–మూడు రాత్రుల టూర్ను ప్రవేశపెట్టడం విశేషం. అదేవిధంగా భక్తులకు అనుకూలంగా రూ.3,000తో మహారాష్ట్ర, కర్ణాటకలోని పంధర్పూర్, గంగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాల దర్శనానికి ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ టూర్లు ప్రయాణికుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.